ఆంధ్ర ప్రదేశ్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్, ఈవో స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందించారు.



