ఆంధ్ర ప్రదేశ్
Ambati Rambabu: భూమనపై మాట్లాడే హక్కు బీఆర్ నాయుడుకి లేదు

Ambati Rambabu: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుక పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడు మాటలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని అన్నారు. టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడికి లేదని అన్నారాయన. కాలు పెట్టగానే తిరుమలలో ఆరుగురు భక్తులు చనిపోయారు. దైవాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ నాయుడు వ్యాపారం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. తిరుమల ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడు.



