తెలంగాణ

గొర్రెల కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన

ED: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. మాజీ ఓఎస్‌డీ కల్యాణ్‌ ఇంట్లో సోదాలు చేశాం. 200 లకు పైగా బ్యాంక్‌ పాస్‌బుక్‌లు సీజ్‌ చేశామన్నారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌లోనూ ఈ బ్యాంక్‌ ఖాతాలను ఉపయోగించారని… 31సెల్‌ఫోన్లు, 20 సిమ్‌కార్డులు సీజ్‌ చేశామన్నారు. ఏడు జిల్లాల్లో 253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్‌ నివేదికలో ఉందన్నారు. 33 జిల్లాల్లో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేట్‌ వ్యక్తులు తమ సొంతఖాతాల్లోకి మళ్లించారని తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button