టీమ్ ఇండియకు ఎడ్జ్బాస్టన్ స్టేడియం ఎందుకు కలిసి రావడం లేదు?

ఎడ్జ్బాస్టన్లో టీమిండియాకు కఠిన పరీక్ష.. ఓటమి శకం చెరిపేసే అవకాశమిదే!
ఇంగ్లండ్తో జరిగిన లీడ్స్ తొలి టెస్ట్లో 5 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా, ఇప్పుడు రెండో టెస్ట్కు సిద్ధమవుతోంది. జూలై 2 నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు ఓ చెడు వార్త ఎదురైంది. ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు ఒక్క టెస్టూ గెలవలేదు.
ఎడ్జ్బాస్టన్లో భారత్ రికార్డు తీవ్ర నిరాశకరం
ఇప్పటివరకు టీమిండియా ఈ మైదానంలో 8 టెస్టులు ఆడగా, 7 ఓటములు, 1 డ్రా మాత్రమే నమోదు చేసింది. చివరిగా 2022లో ఇంగ్లండ్తో ఇదే వేదికపై జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అటు ఫీల్డింగ్, బౌలింగ్ లోపాలు కూడా భారత్ను లీడ్స్లో ఓటమికి దారి తీశాయి. మొదటి టెస్ట్లో జస్ప్రీత్ బుమ్రా మాత్రమే బౌలింగ్లో ఆకట్టుకున్నాడు. అయితే బ్యాటింగ్లో పంత్ రెండు సెంచరీలు కొట్టగా, గిల్, జైస్వాల్, రాహుల్ కూడా అద్భుతంగా రాణించారు.
ఇంకో తప్పు చేస్తే… డబ్ల్యూటీసీ గేట్లు మూసినట్టే!
ఇంగ్లండ్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో వారి ఆటగాళ్లు బెన్ డకెట్, స్టోక్స్, రూట్, ఓలీ పోప్ ఫామ్లో ఉన్నారు. వీరిని ఎడ్జ్బాస్టన్లో నిలువరించాలంటే భారత్ గొప్ప ప్రదర్శన అవసరం. గిల్ సేన ఫీల్డింగ్, బౌలింగ్ లోపాలను పూరించి బలంగా బరిలో దిగితే.. ఎడ్జ్బాస్టన్లో తమ చెత్త రికార్డుకు పుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది. అదో సువర్ణావకాశం.. సిరీస్ను 1-1తో సమం చేసి టెస్ట్ ఛాంపియన్షిప్ ఆశలను నిలబెట్టుకునే శుభసమయం.