ఆంధ్ర ప్రదేశ్
విశాఖలో రెచ్చిపోతున్నకబ్జాదారులు

విశాఖలో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములను చోటమోట నాయకులు స్వాహా చేస్తున్నారు. గత వైసీపీలో అవినీతి అంటూ పలికిన నేతలే నేడు భూ దందాలతో చెలరేగిపోతున్నారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూమిలో బహుళ కట్టడాలు జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏడాదిగా బంజరభూమిలో నిర్మాణం జరిగినా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు.
జీవీఎంసీ పరిధిలో ఉన్న బుచ్చిరాజుపాలెంలోని సర్వే నెంబర్ 2/2 లో అక్రమ కట్టడాలు కడుతున్నారు కబ్జాదారులు. తప్పుడు సర్వే నెంబర్ 2/1 గా మార్చి అనుమతులు తీసుకున్నారు కబ్జాదారుడు. డిజిటల్ సర్వేలో ఈ బాగోతం అంతా బయటపడింది. అయితే ఇంత జరుగుతున్నా పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.