ఆంధ్ర ప్రదేశ్
Anakapalle: ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో విష వాయువులు లీక్

Anakapalle: ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. అనకాపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో విష వాయువులు లీక్ అవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి కూడా విషమంగా ఉంది.
మృతులు చంద్రశేఖర్, కుమార్గా గుర్తించారు. మృతుల కుటుంబసభ్యులకు యాజమా న్యం కోటి రూపాయలు చెల్లించాలని తోటి కార్మికుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా యాజమాన్యం సరైన భద్రత ప్రమాణాలు పాటించని కారణంతో ప్రమాదం జరిగిం దంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.