తారక్ సినిమాలో యానిమల్ బ్యూటీ?

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో ఎన్టీఆర్ కొత్త లుక్లో మెస్మరైజ్ చేయనున్నాడు. అయితే తాజాగా హీరోయిన్గా తృప్తి డిమ్రి పేరు వినిపిస్తుండగా, ఆమె లీడ్ హీరోయినా, సెకండ్ హీరోయినా అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ప్రస్తుతం కర్ణాటకలో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కోసం స్పెషల్ సెట్ నిర్మాణం జరుగుతోంది. ఈ సన్నివేశంలో ఎన్టీఆర్తో పాటు ప్రకాష్ రాజ్, ఇతర కీలక నటులు పాల్గొంటారని సమాచారం. సినిమా మొత్తానికి ఈ యాక్షన్ సీన్ హైలైట్గా నిలవనుంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తన కెరీర్లోనే బెస్ట్ స్క్రిప్ట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడని, ఎన్టీఆర్ కెరీర్లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.