తెలంగాణ
మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

KCR: మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కమిషన్ ముందుకు హాజరుకావాలని కేసీఆర్ యోచిస్తున్నారు. విచారణకు హాజరుకాకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చించారు.