ఆంధ్ర ప్రదేశ్
విశాఖలో పెరుగుతున్న మిస్సింగ్ కేసులు

Visakhapatnam: విశాఖలో మిస్సింగ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేవలం నాలుగు నెలలోనే.. 175 మంది మహిళలు అదృశ్యం అయ్యారు. కేసును సీరియస్గా తీసుకున్న విశాఖ సీపీ పోలీసులకు పలు సూచనలు చేశారు. ఇక సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా 135 కేసులను ఛేదించారు. అయితే బాధితుల సెల్ఫోన్ ఆధారంగా మిస్టరీ వీడుతున్న ట్లు పోలీసులు వెల్లడించారు.
అంతేకాదు సోషల్ మీడియా వేదికగా పరిచయమైన వారితో వెళ్లామని మహిళలు చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. విచారణలో తమకు ఇలాంటి విషయాలు ఎన్నో తెలిశాయంటున్నారు పోలీసులు. అయితే ఇంకా 47 మంది మహిళల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఎప్పటికప్పుడు తాము కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.