కూటమి ప్రభుత్వం జనసేనను చిన్నచూపు చూస్తుందా..?

AP News: కూటమి ప్రభుత్వం జనసేనను చిన్నచూపు చూస్తుందా..?నామినేటడ్ పదువుల్లో పవన్ పార్టీకి ప్రాధాన్యత దక్కట్లేదా..?అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పవన్, చంద్రబాబు కలిసి నాటి నుండి ఆ జిల్లాలో టీడీపీ గెలుపుకు ఎంతో కష్టపడ్డారు ఆ జనసేన నేత. స్ధానిక టీడీపీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా మారాడు. అయినా ఫలితం లేకుండా పోయింది.
జిల్లాకు చెందిన పదవి పై ఆశపడ్డ ఆ నేతకు చివరకు భంగపాటు తప్పని పరిస్ధితి దాపురించింది. దీంతో ఆ జిల్లాలో జనసైనికులు టీడీపీ పై ఫైర్ అవుతున్నారట. ఇదేమి దారుణమంటూ పెదవి విరుస్తున్నారట. ఇంతకు ఏంటా జిల్లా..?ఎవరా ఆ నాయకుడు..?
రాష్ట్రంలో కూటమి ఏర్పడటానికి మొదట నడుం బిగించింది జనసేన అధినేత పవన్ కల్యాణ్. బిజేపి టీడీపీని దూరం పెట్టి పో పో అంటున్నా తను బాధ్యత తీసుకుని కూటమి ఏర్పాటుకు తోడ్పాటును అందిచారు పనవ్ కల్యాణ్. పవన్ ఆ రోజు చేసిన ప్రయత్నం వల్లే గత ఎన్నీకల్లో కూటమి పార్టీలు భారీ మెజారిటీతో గద్దెనెక్కాయి.
అలాంటి పవన్ పార్టీకి నామినేటడ్ పదవుల్లో అన్యాయం జరుగుతుందట. రాష్ట్రంలో, జిల్లాల్లో అనేక నామినేటడ్ పదవులు ఉండగా పెద్దగా పేరు కూడా తెలియని పదవులే జనసేన నేతలకు కేటాయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయ్. ముఖ్యమైన పదవులన్ని టీడీపీ తన బుట్టలో వేసుకుంటుదనే ఆరోపణలు ఉన్నాయ్. ఇదే ఇప్పుడు ప్రకాశంజిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ప్రభుత్వం నామినేటడ్ పదవులను భర్తీ చేసింది. ఇందులో ప్రకాశంజిల్లా జనసేన ఇంఛార్జీగా ఉన్న రియాజ్ కు కూడా రాష్ట్ర స్ధాయి పదవి దక్కింది. అయితే పదవి వచ్చిందని ఆనందపడాలో లేక కోరుకున్నది రాలేదని బాధ పడాలో అర్ధం కానీ పరిస్ధితిలో రియాజ్ ఉన్నరనే టాక్ వినిపిస్తుంది. కూటమి పార్టీల సర్ధుబాటులో భాగంగా ప్రకాశం జిల్లా జేఎస్పీ ఇంచార్జీగా ఉన్న రియాజ్ కు ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజన్సీ అంటే పశుగణాభివృద్ది సంస్ధ కార్పోరేషన్ చైర్మన్ పదవి దక్కింది.
అయితే మెదట నుండి రియాజ్ కోరుకున్నది ఒంగోలు అర్భన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ పదవి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కూడా రియాజ్ పేరునే సూచించారు. అయితే జిల్లాలో ఉన్న ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు దీనికి అడ్డుపడినట్టు టాక్ వినిపిస్తుంది.
ఒడా చైర్మన్ అంటే జిల్లాలోని అనేక నియోజివర్గాలతో సబంధం ఉండే పదవి. ఇంత కీలకమైన పదవిని జనసేనకు ఎలా కేటాయింస్తారనే వాదన టీడీపీ ఎమ్మెల్యేలు తెరమీదకు తెచ్చారట. ఈ విషయాన్నీ పసుపు పార్టీ పెద్దలు వద్దకు తీసుకెళ్లారట. దీంతో సైకిల్ పార్టీ అధిష్టానం కూడా ఇంతటి ప్రాధన్యత ఉన్న పదవిని టీడీపీ నేతలకే కేటాయించాలని డిసైడ్ అయిందట. దీంతో వెంటనే ఆ రేసులో ఉన్న రియాజ్ పేరును తొలగించేశారనే టాక్ ఉంది.
ఒంగోలులోని రంగుతోటకు చెందిన రియాజ్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల అభిమాని. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ సభ్యత్వం తీసుకుని చిరంజీవికు దగ్గరయ్యారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర కోఆర్డినేటరుగా, రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. అనంతరం 2014లో జనసేనలో చేరారు.
2019లో జనసేన ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి జిల్లా అధ్యకుడిగా కొనసాగుతున్నారు. 2024లో కూటమి పార్టీల అభ్యర్ధిగా ఒంగోలు నుండి పోటీ చేసిన దామచర్ల జనార్ధన్ విజయానికి కష్టపడ్డారు. దీంతో రియాజ్ సేవలను గుర్తించిన జనార్ధన్ రియాజ్ కోరుకున్న ఒడా చైర్మన్ పదవికి రిఫర్ చేశారు.
అయితే టీడీపీ నేతలు అడ్డం తిరగడంతో రియాజ్కు చెక్ పడినట్టు అయింది. చివరకు ఒడాను పక్కన పెట్టి సరిగా పేరు కూడా ప్రజలకు తెలియని రాష్టస్ధాయి కారర్పోరేషన్ చైర్మన పదవిని టీడీపీ అంటగట్టింది. దీంతో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని జనసేన క్యాడర్ టీడీపీ అధిష్టానం పై మండిపడుతుంది.
నామినేటెడ్ పదవుల పంపిణీలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇదేమి మిత్రధర్మమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన కార్పొరేషన్లను చంద్రబాబు తమ పార్టీ వారికే ఇచ్చుకున్నారని మండిపడుతున్నారు. మరోవైపు నామినేటెడ్ పదవుల్లో చంద్రబాబు ఓసీలకే ప్రాధాన్యత ఇవ్వడంపై మిగతా సామాజికవర్గాల నేతలు గుర్రుగా ఉన్నారు.
20 పదవుల్లో 9 ఓసీలకే కట్టబెట్టారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నా ఏడు పదవులే ఇచ్చారని వెనుకబడిన వర్గాల నేతలు వాపోతున్నారు. ఎస్సీలకు రెండు, ఎస్టీ ఒకటి, మైనారిటీలకు ఒకటి కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
చంద్రబాబుతో పొత్తు అంటే ఇలాగే ఉంటుంది మరి ఆయన పార్టీ టీడీపీ తప్ప మిత్రపక్షంలోని ఏ పార్టీకి అయినా ఆ తర్వాత పట్టేది అధోగతే పడుతుందని మండిపడుతున్నారు. గతంలో వామపక్షాలు, బీజేపీ.. ఇప్పుడు జనసేన. పార్టీ ఎదుగదల దశలోనే జనసేనను చంద్రబాబు చిదిమేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. పొత్తుల పేరుతో ఆ పార్టీని రెండు పార్టీలను జిల్లాలకే పరిమితం చేశారన్న వాదన వినిపిస్తుంది.
జనసేన అధినేత పవన్కళ్యాణ్ను ఓ బొమ్మలా మార్చేసుకొని, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 21 మాత్రమే ఇచ్చి, మమ అనిపించేశారట. రాష్ట్రంలో ఒక బలమైన సామాజికవర్గంలో ఎక్కువ మంది రాజకీయాల్లో ప్రాధాన్యత కోసం పవన్ కళ్యాణ్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అలాంటి పార్టీని చంద్రబాబు వ్యూహాత్మకంగా దెబ్బతీసి, పొత్తుల పేరుతో ఉప ప్రాంతీయ పార్టీకన్నా తక్కువ స్థాయికి దిగజార్చారని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు టీడీపీ అగ్ర నాయకత్వం కూడా మిత్రపక్షాన్ని చిన్నచూపు చూస్తుందన్న భావన ప్రకాశం జిల్లా జనసైనికులలో కనబడుతోంది. జిల్లాకు చెందిన నాయకుడికి ఒడా చైర్మన్ పదవి ఇవ్వడానికున్న అభ్యంతరం ఏంటనే ప్రశ్నిస్తుంది. టీడీపీ ఎమ్మెల్యేల గెలుపు కోసం జిల్లాలోని జనసైనికులు పడిన కష్టాన్నీ టీడీపీ నేతలు గెలిచిన తర్వాత మరిచిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయ్.
మరోవైపు రియాజ్ కూడా వచ్చిన ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజన్సీ చైర్మన్ పదవి పట్ల అసంతృప్తిగానే ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. జనసేన అగ్ర నాయకత్వం కూడా టీడీపీ అధిష్టానం ఏం చెప్పినా అన్నిటికి తల ఊపుతుందనే విమర్శ కూడా సొంత పార్టీ నేతల్లో వినపడుతోంది.
ఇప్పటికైన జనసేన తన పార్టీ నేతలకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయం పై టీడీపీని ప్రశ్నించాలని గ్లాస్ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. మరీ పార్టీ చీఫ్ పవన్ ఈ విషయాలపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.