IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మే 17న ఐపీఎల్ 2025 పునఃప్రారంభం

IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ రీస్టార్ట్ కానుంది. ఐపీఎల్ను ఈనెల 17న పునఃప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన మ్యాచ్లను ఆరు వేదికల్లో నిర్వహించనుంది. జూన్ 3న ఫైనల్ జరగనుంది. భారత్పై పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో బీసీసీఐలీగ్ను వారం పాటు వాయిదా వేసింది. అయితే భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఐపీఎల్ను తిరిగి ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది.
ఈనెల 17న బెంగళూరులో కోల్కతా-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోరు ద్వారా లీగ్ పునఃప్రారంభంకానుంది. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లఖ్నవూ, అహ్మదాబాద్, ముంబైలలో లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. ప్లేఆఫ్స్ మ్యాచ్ల వేదికలను తర్వాత వెల్లడిస్తామని బీసీసీఐ తెలిపింది. ఈనెల 8న అర్ధంతరంగా నిలిపివేసిన పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ 24న జైపూర్ వేదికగా జరుగుతుంది. ఆరు వేదికల్లో మొత్తం 13 లీగ్ మ్యాచ్లు, నాలుగు ప్లే ఆఫ్లు కలిపి మొత్తం 17 మ్యాచ్లు జరుగుతాయి.