తెలంగాణ

Uttam Kumar Reddy: లబ్దిదారుల ఇళ్లలో భోజనం చేయాలి

Uttam Kumar Reddy: అతి త్వరలో 30 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. త్రివర్ణంలో బీపీఎల్ కార్డులు ఉండబోతున్నాయని అన్నారు. గ్రీన్ కలర్‌లో ఏపీఎల్ కార్డులు ఉంటాయని చెప్పారు. వీటి ద్వారా రాష్ట్రంలోని 1.10 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులంతా స్థానిక రేషన్ షాపులను తనిఖీ చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఇళ్లలో భోజనం చేయాలని సూచించారు.

శ్రీరామనవమి పండుగరోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటిస్తారని అదేరోజు సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేస్తారని చెప్పారు. రేషన్ దుకాణాలకు సన్న బియ్యం రవాణా, పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన ఆహార భద్రత రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలనను త్వరగా పూర్తిచేయాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button