తెలంగాణ
Kaleshwaram: సరస్వతీ పుష్కరాలకు భారీగా తరలివస్తున్న భక్తులు

Kaleshwaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు కొనసాగుతున్నాయి. సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజామునుండే భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేలాదిగా వస్తున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదిమాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సైకత లింగాలను ఏర్పాటు చేసి భక్తులు పూజిస్తున్నారు.