ఆంధ్ర ప్రదేశ్
PM Modi: ఈనెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన

PM Modi: ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వేజోన్ పరిపాలన భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు.