ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమలలో నమాజ్ చేసిన అన్యమతస్థుడు

Tirumala: తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. శ్రీనివాసుడి సన్నిధిలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్యమతస్థుడు నమాజ్ చేయడం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలకి ఎదురుగానే అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు.

పురోహిత సంఘం వద్దే ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇలా చేయడం ఏంటని భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహిస్తున్నారు.

పాపవినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక సమీపంలోని పురోహిత సంఘంలో ఓ అన్యమతస్థుడు బహిరంగంగానే నమాజ్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. నిత్యం స్వామివారి చెంత కళ్యాణం చేసుకుని వచ్చే భక్తులతో కళ్యాణ వేదిక ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ ప్రాంతం వద్ద ఓ వ్యక్తి నమాజ్ చేయడాన్ని చూసిన భక్తులు భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నమాజ్ చేసిన వ్యక్తి కోసం టీటీడీ విజిలెన్స్ అధికారులు గాలిస్తున్నారు.

అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్న ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలను ద్వారా అయినా భద్రతా సిబ్బంది దాన్ని గుర్తించి వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ కంట్రోల్‌ రూంలో ఉన్న భద్రతా సిబ్బంది స్పందకపోవడంతో అన్యమతస్థుడు అక్కడే దర్జాగా పది నిమిషాల పాటు నమాజ్ చేశారు. ఆ తర్వాత పార్కింగ్‌లో ఉన్న కారులో ఉండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button