తెలంగాణ
Revanth Reddy: హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్.. ఎయిర్పోర్టులో ఘనస్వాగతం

Revanth Reddy: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్నారు ఆయన. ముఖ్యమంత్రి రేవంత్కు పార్టీ శ్రేణులు, అభిమానులు విమానాశ్రయం లో ఘన స్వాగతం పలికారు.
ఇక సీఎం రేవంత్ దావోస్ పర్యటనతో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఏకంగా 1.78లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఇందుకు సంబంధించి 20 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది.