తెలంగాణ

Hydraa: వారి ఇళ్లు కూల్చం.. హైడ్రా విధివిధానాలు వెల్లడించిన కమిషనర్ రంగనాథ్

Ferry Accident: మహారాష్ట్రలో పడవ ప్రమాదం జరిగింది. ముంబై తీరంలో వెళ్తున్న ఓ ఫెర్రీ నౌకను.. సముద్రంలో వెళ్తున్న ఓ స్పీడ్ బోట్ అతివేగంతో వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ఫెర్రీ నౌక మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న పర్యాటకులు నీటిలో పడిపోయారు. ఇందులో ఇప్పటివరకు ఒక వ్యక్తి మరణించినట్లు అధికారులు గుర్తించారు. మరికొంతమంది సముద్రంలో పడి ఆచూకీ గల్లంతైందని వివరించారు. పడవ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అధికారులు, నేవీ, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని భారీ రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు.

ఫెర్రీ నౌక మునిగిపోయిన వెంటనే స్పందించిన రెస్క్యూ బృందాలు భారీగా అక్కడికి చేరుకున్నాయి. 11 నేవీ పడవలతో పాటు తీర ప్రాంత దళాలకు చెందిన 3 పడవలు, 4 హెలికాప్టర్లను రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి. పోర్టు అధికారులు, కోస్ట్‌గార్డు, మత్స్యకారుల సహాయంతో సముద్రంలో గల్లంతైన వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇక ప్రమాదం జరిగిన సమయంలో ఫెర్రీ నౌకలో దాదాపు 70 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఇక ముంబై తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 66 మందిని రక్షించినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఈ ఘటనలో కొందరి ఆచూకీ లభ్యం కాలేదని.. వారికోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.

ముంబైలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు పర్యాటకులతో వెళ్తున్న నీల్‌కమల్‌ పేరుతో ఉన్న ఫెర్రీ నౌక.. సముద్రంలో ప్రయాణిస్తుండగా.. నలుగురు వ్యక్తులు ఉన్న ఓ చిన్న స్పీడు బోటు ఢీకొట్టింది. స్పీడ్ బోటు అతివేగంతో వచ్చి ఫెర్రీ నౌకను ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న వారి సెల్‌ఫోన్లలో రికార్డ్ కావడంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button