ఆంధ్ర ప్రదేశ్
Srisailam: ప్రమాదంలో శ్రీశైలం జలాశయం

Srisailam: శ్రీశైలం జలాశయం ప్రమాదపు అంచుల్లోకి చేరుకుంది. ఈ విషయాన్ని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ చెప్పింది. ఏడాది క్రితమే ప్రమాదంపై సమాచారం అందించింది. జలాశయం కింద భూగర్భంలోని.. రాతిఫలకల మధ్య బలహీన అతుకులు ఉన్నట్లు NDSA చెబుతోంది.
అయితే ఈ అనుబంధ జాయింట్ల మధ్య దూరం పెరిగితే జలాశయం పునాదులు రక్షణ కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో రెండ్రోజుల్లో నిపుణుల కమిటీతో జలాశయం పరిశీలించనున్నారు మంత్రి నిమ్మల. అంతేకాదు మర మ్మత్తుల కోసం కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.