తెలంగాణ
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు.. అనర్హత వేటు తప్పదా..?

తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసును సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తదుపరి విచారణ ఈనెల 10కి వాయిదా వేసింది. పార్టీ ఫిరాయింపుపై గతంలో దాఖలైన పిటిషన్లను ఈ కేసుతో సుప్రీంకోర్టు ట్యాగ్ చేసింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పోచారం, సంజయ్, మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీ, కాలే యాదయ్య, బండ్ల కృష్ణా మోహన్ రెడ్డి,ప్రకాష్ గౌడ్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.