తెలంగాణ
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో తాగునీటి కష్టాలు

Nirmal: అధికారుల నిర్లక్ష్యంతో మిషన్ భగీరథ నీరు పక్కదారి పడుతోంది. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని పలు గ్రామాల్లో.. తాగునీటి కోసం ప్రజలు నానా అవస్తలు పడుతున్నారు. అయితే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో.. మిషన్ భగీరథ నీళ్లు పక్కదారి పట్టాయి.
బోరిగాం, హిప్నేల్లిలో మొక్క జొన్న పంటకు నీరు మళ్లించారు కొందరు రైతులు. అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.