తెలంగాణ
Nagarkurnool: నాగర్కర్నూలు జిల్లా మైలారంలో టెన్షన్.. టెన్షన్..

Nagarkurnool: నాగర్కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మైనింగ్కు వ్యతిరేకంగా రైతులు రిలే దీక్షలు చేపట్టారు. ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో మరింత ఉద్రికత్త చోటుచేసుకుంది. అయితే.. అధికారులు, రాజకీయ నాయకులకు ఎంత చెప్పినా ఫలితం లేదంటున్నారు గ్రామస్తులు.
మరోవైపు ఊళ్లోకి ఎవరూ రాకుండా ఆందోళనకారులు కంచె ఏర్పాటు చేసి నిరసన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో మాజీ సర్పంచ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది.