తెలంగాణ
Ponnam: పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు ఏం చేశారు?

Ponnam: ఎమ్మెల్సీ కవితకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో బీసీలకు కనీస గౌరవం దక్కలేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్కు బీసీలు గుర్తుకు వస్తారని అన్నారు. బీఆర్ఎస్ బీసీలకు ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.