తెలంగాణ
Harish Rao: జీవోలను వెబ్సైట్లో పెట్టడం లేదు

Harish Rao: అసెంబ్లీ లాబీలో చేసిన చిట్చాట్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేక.. ప్రశ్నోత్తరాలను రద్దు చేసుకుందన్నారు. దీనిపై స్పీకర్, కార్యదర్శికి అభ్యంతరం చెప్పామని తెలిపారు.
ప్రభుత్వం HMDA భూములు తాకట్టు పెట్టి.. 20వేల కోట్లు అప్పు తెస్తుందన్నారు. HMWSను తాకట్టు పెట్టి 10వేల కోట్లు అప్పు.. GHMC ఆస్తులను తాకట్టు పెట్టి 10వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధమైందన్నారు. జీవోలను వెబ్సైట్లో పెట్టడం లేదన్నారు హరీష్రావు.