తెలంగాణ

Bibinagar: గుడి దగ్గర పసికందును వదిలేసి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు

అప్పుడే పుట్టిన పసికందును ఆలయ పరిసరాల్లో వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారంలో చోటు చేసుకుంది. శ్రీ లింగ బసవేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లారు.

ఆ తర్వాత కాసేపటికి పాప ఏడుపులతో చిన్నారిని గమనించిన స్థానికులు ఆలయ పూజారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పాపను భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అసలు పాపను ఎవరు వదిలి వెళ్లారు, ఎందుకు వదిలేసి వెళ్లారనే వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button