తెలంగాణ
Bandi Sanjay: గతలో బీఆర్ఎస్ ..ఇప్పుడు కాంగ్రెస్ కోతలు

Bandi Sanjay: తెలంగాణలో గ్రీన్ మర్డర్ జరుగుతోందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ కోతలు మరింత లోతుగా ఉన్నాయన్నారు. కాళేశ్వరం కోసం బీఆర్ఎస్ 25 లక్షల చెట్లను నరికివేసిందని విమర్శించారు.
హరితహారం ముసుగులో కోనోకార్పస్ను బహుమతిగా ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కంచ గచ్చిబౌలిలో జరిగిన హరిత విధ్వంసంలో కాంగ్రెస్ చేరిందని పేర్కొన్నారు. అదే గొడ్డలి కొత్త చేతులని అన్నారు. తెలంగాణలో అటవీ నిర్మూలన మాఫియాను ప్రోత్సహిస్తున్నారని సంజయ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.