తెలంగాణ
Pranay Murder case: ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..

Pranay Murder Case: నల్గొండ జిల్ల మిర్యాలగూడలో సంచలనం సృష్టించింది ప్రణయ్ మర్డర్ వ్యవహారం. ఈ కేసులో సంచలన తీర్పు వెలువరించింది నల్గొండ కోర్టు. ఒకరికి మరణ శిక్ష విధించగా మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ నేపథ్యంలోనే ఆనాడు నల్గొండ SP గా ఉన్న ఏవీ రంగనాథ్కు ప్రణయ్ భార్య అమృత ఫోన్ కాల్ చేసింది.
ఈ సందర్బంగా ప్రణయ్ను చంపిన వ్యక్తికి ఉరి శిక్ష, మిగతావారికి జీవిత పడేలా కేసు నిలబెట్టినందుకు రంగనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు అమృత. అయితే కేసులో తమకు మొదటి నుంచి సహకరించినందుకు అమృతకు తిరిగి కృతజ్ఞతలు తెలిపారు రంగనాథ్ .