క్రీడలు
IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తొలి మ్యాచ్ నేడు

IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా ఇవాళ బంగ్లాదేశ్తో తలపడేందుకు సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ-2017లో ఈ రెండు జట్లు సెమీ ఫైనల్స్లో తలపడగా భారత్ ఘన విజయం సాధించింది. టీ20 వరల్డ్కప్ విజయంతో మరోసారి ఐసీసీ ఈవెంట్స్లోకి భారత్ అడుగుపెట్టింది. ఐసీసీ ఈవెంట్లలో వరుసగా ఫైనల్స్కు చేరుకున్న టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.