ఆంధ్ర ప్రదేశ్

Nara Lokesh: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. 60 రోజుల్లో చర్యలు తీసుకుంటాం

Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీసీ ప్రసాద్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజి లెన్స్ విచారణకు ఆదేశిస్తామన్నారు మంత్రి నారా లోకేష్. 60 రోజుల్లో చర్యలు తీసుకుంటామని స్పస్టం చేశారు. వైసీపీ కోసం పనిచేశారని మాజీ వీసీపై టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు.

అంతేకాదు వర్సిటీని వైసీపీ ఆఫీస్‌గా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వర్సిటీలో తప్పు చేయాలంటేనే ఇకపై భయపడేలాగా చర్యలు ఉంటాయన్నారు నారా లోకేష్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button