తెలంగాణ
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీని కలిసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్

తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీలో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ కలిసారు. ధాన్యం బకాయిలు వెయ్యి 468.94 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి విన్నవించారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 343.27 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం. సీఎంఆర్ డెలీవరి గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.