ఆంధ్ర ప్రదేశ్
Kesineni Chinni: అధికారం కోల్పోయిన వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాలు తగ్గలేదు

Kesineni Chinni: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ ఎన్నికపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. అధికారం కోల్పోయిన వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాలు తగ్గలేదని ఆయన మండిపడ్డారు. తిరువూరు చైర్మన్ ఎన్నిక నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందన్నారు. మెజార్టీ ఉన్న పార్టీ మేయర్ పీఠం దక్కించుకుంటుందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.