ఆంధ్ర ప్రదేశ్
MLC Counting: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ.. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తెలలేదు

MLC Election Counting: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తెలలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో APTF అభ్యర్ధి పాకలపాటి రఘువర్మ ముందంజలో ఉన్నారు.
రెండో స్థానంలో PRTU అభ్యర్ధి శ్రీనివాసుల నాయుడు ఉన్నారు. మూడో స్థానంలో PDF అభ్యర్థి విజయ గౌరీ ఉన్నారు. 300లకు పైగా చెల్లని ఓట్లు నమోదైయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం రాకపోవడంతో అధికారులు ఎలిమినేషన్ రౌండ్ను ప్రారంభించారు. రెండో ప్రాధాన్యత ఓట్లపై ఉత్కంఠ నెలకొంది.