ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో పున:ప్రారంభ పనులకు శంకుస్థాపన

Amaravati: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన పురస్కరించుకొని.. పునఃప్రారంభ పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 49వేల 040 కోట్ల రూపాయలతో అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన, శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ.
అలాగే ఆలిండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి, 57వేల 962 కోట్లతో కేంద్ర ప్రాజెక్టులకు, కృష్ణాజిల్లాలోని నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్కు శంకుస్థాపన చేయనున్నారు మోదీ. విశాఖలో యూనిటీ మాల్, పలు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు.