News
సంక్రాంతికి సొంతూళ్లకు.. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిక్కిరిసిపోయిన వాహనాలు

సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు స్వగ్రామాలకు బయలుదేరారు. నేటి నుంచి వరుస సెలవులు ఉండటంతో సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. పండగకు వెళ్లే వారితో మెట్రో రైళ్లలో రద్దీ నెలకొంది.
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎల్బీనగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. మియాపూర్, రాయదుర్గం, జేఎన్టీయూ, అమీర్పేట్, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర స్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. హైదరాబాద్ – విజయవాడ రహదారిపై ట్రాఫిక్ను పోలీసులు నియంత్రిస్తున్నారు. ఈ మార్గంలో ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద కిక్కిరిసిపోయిన వాహనాలు . కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.