News

Pawan Kalyan: మార్క్ శంకర్‌కు కొనసాగుతున్న వైద్య పరీక్షలు

Pawan Kalyan: అగ్నిప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సింగపూర్ వెళ్లిన పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకొని తన కుమారుడిని పరామర్శించారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని అక్కడి వైద్యులు పవన్‌కు తెలిపారు. బుధవారం ఉదయం బాలుడిని అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులు తమ పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button