జాతియం
ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట.. సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ..

Maha Kumbh 2025: ప్రయోగ్రాజ్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నట్లు ప్రకటించారు. ప్రయోగ్రాజ్ సెక్టార్-2లో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. అర్ధరాత్రి 2గంటల సమయంలో తొక్కిసలాట ఘటన జరిగిందని.. భక్తులు బారికేడ్లు తోసుకుంటూ దూసుకొచ్చారని వెల్లడించారు. ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ నాలుగుసార్లు ఫోన్ చేశారని.. ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారని తెలిపారు.