తెలంగాణ

HCA, SRH ఐపీఎల్ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ

HCA, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ షురూ అయింది. విజిలెన్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో విచారణ చేపట్టారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, స్టేడియం సిబ్బందిని విచారిస్తున్నారు. టికెట్ల అమ్మకం, పాసుల జారీ, తదితర అంశాలపై శ్రీనివాస్‌రెడ్డి వారిని అడిగి తెలుసుకుంటున్నారు.

కాగా, టికెట్లు, పాసుల కోసం తమను ఇబ్బంది పెడుతుందని హెచ్‌సీఏపై ఎస్ఆర్‌హెచ్ ఆరోపణల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి యాక్షన్ చేపట్టారు. సమగ్ర నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో నిజాలు రాబట్టేందుకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. అడ్మిన్ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులతో విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button