తెలంగాణ
Telangana: ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు

Telangana: తెలంగాణకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను తెలంగాణకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను వెంటనే రిలీవ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ క్యాడర్కు చెందిన ఈ ముగ్గురు ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్నారు. ఏపీలో రిపోర్ట్ చేయాలని అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను ఆదేశించింది కేంద్ర హోంశాఖ.
అంజనీకుమార్ తెలంగాణ రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీగా, అభిలాష బిస్త్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా, ట్రైనింగ్స్ డీజీగా పనిచేస్తున్నారు. అభిషేక్ మహంతి కరీంనగర్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.