తెలంగాణ
Medchal: ఫీజ్ కట్టలేదని మందలించిన ప్రిన్సిపాల్.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Medchal: మేడ్చల్ జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య స్కూల్ మేనేజ్మెంట్ వేధింపులు మరింత రెట్టింపు అయ్యాయి. ఫీజు కట్టలేదని విద్యార్థినిని.. ప్రిన్సిపాల్ రమాదేవి మందలించారు. దీంతో మనస్తాపం చెందిన స్టూడెంట్.. ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ప్రస్తుతం చావు బ్రతుకుల మధ్య విద్యార్థిని కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు స్కూల్ మేనేజ్మెంట్ తీరుపై విద్యార్థిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 2లక్షలు ఇస్తాం.. తమ కూతురుని తెచ్చివ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తన కూతురు వెంటిలేటర్పై ఉందని తల్లి కన్నీరుమున్నీరు అవుతోంది.