తెలంగాణ

Revanth Reddy: సీఎం రేవంత్‌ను కలిసిన దేశ్‌పాండే ఫౌండేషన్ సభ్యులు

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేశ్ పాండే ఫౌండేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితుల మార్పు కోసం పనిచేస్తున్న ఫౌండేషన్ గురించి సీఎంకు వివరించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడానికి పనిచేస్తున్న ఈ సంస్థను రేవంత్ అభినందించారు. ఇక రాష్ట్రంలో తమ కార్యక్రమాల విస్తరణకు సహకారం ఇవ్వాలని సీఎంను కోరారు.

కస్తూర్భా బాలికల పాఠశాలల్లో పనిచేయాలని సీఎం సూచించారు. వారికి తప్పకుండా ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను దత్తత తీసుకోవాలని సీఎం కోరారు. దీంతో సీఎం సూచనలను తప్పక ఆచరిస్తామని ఫౌండేషన్ సభ్యులు అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button