తెలంగాణ
నేడు సుప్రీంకోర్టులో కంచ గచ్చిబౌలి కేసు విచారణ

Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కాదని 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో పొదలు పెరిగాయని తెలిపింది. కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి జంతువులు లేవన్న సర్కార్ కంచె ఏర్పాటు చేయడానికి తాము ప్రయత్నించామంది.
పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం నేడు విచారించనుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ జార్జ్ బెంచ్ వాదనలు, ప్రతివాదనలు విననుంది. మొత్తానికి నేడు కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో సర్వాత్రా ఆసక్తి నెలకొంది. అదేవిధంగా కంచ గచ్చబౌలి భూములపై మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిటిషన్ను బీ ది చేంజ్ వెల్ఫేర్ సొసైటీ దాఖలు చేసింది.