తెలంగాణ

Banjara Hills: పార్కు స్థలంలో అక్రమ డంపింగ్.. పోలీసుల అదుపులో నిందితులు

Banjara Hills: తాజ్ బంజారా చెరువు దగ్గర అక్రమ డంపింగ్ పై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో తాజ్ బంజారా చెరువు దగ్గర కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లారీల ద్వారా మట్టిని డంపింగ్ చేస్తున్నారన్న సమాచారంతో మేయర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డంపింగ్ చేస్తున్న రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధాన రోడ్డు మీద GHMC పార్క్ గేట్ నుంచి లోపలకి వెళ్లి ప్రైవేట్ వ్యక్తులు ఎలా డంపింగ్ చేస్తున్నారు వారికి సహకారం అందిస్తున్న వారు ఎవరు అనే అంశంపై విచారణ చేపట్టాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button