ఆంధ్ర ప్రదేశ్
Vangalapudi Anitha: టీడీపీ నాయకులను వేధించడానికి జగన్ సీఐడీని వినియోగించారు

Vangalapudi Anitha: తప్పు చేసిన వారికి శిక్షపడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని హోంమంత్రి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వంలో సాక్ష్యాలు లేకుండా పోలీసులు ఏ కేసులోనూ ముందుకెళ్లడం లేదన్నీరు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారి పట్ల ఓ పద్ధతి ప్రకారం చట్టపరంగానే వెళ్తున్నామన్నారు.
టీడీపీ హయాంలో ఏ అధికారీ ఇబ్బంది పడలేదని హోంమంత్రి అనిత అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తప్పుడు పనులు చేయడం వల్లే అధికారులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులను వేధించడానికి జగన్ సీఐడీని వినియోగించారని అనిత విమర్శించారు.