జాతియం
పంజాబ్ రైతుల నిరసన శిబిరాలు తొలగింపు

Punjab: పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు రైతుల నిరసన శిబిరాల తొలగింపును చేపట్టారు. దీంతో శంభు, ఖనౌరీ సరిహద్దుల్లో ఉద్రికత్త పరిస్థితులు చోటుచేసుకు న్నాయి. అటు శంభు, ఖనౌరీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో రైతులను బలవంతంగా పోలీసులు తరలిస్తున్నారు.
అలాగే జేసీబీల సాయంతో నిరసన శిబిరాలు తొలగింపు చేపట్టగా ముందస్తు జాగ్రత్తగా శంభు, ఖనౌరీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై రైతు సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మద్దతు ధర కల్పించేవరకు ఆందోళనలు ఆగవని హెచ్చరిస్తున్నారు.