క్రీడలు

IPL 2025: నేడు ఆర్సిబీతో ముంబై బిగ్ ఫైట్

IPL 2025: ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

ముంబై జట్టు తమ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కేవలం 12 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని చవిచూసింది. అయితే ఇవా జరిగే మ్యాచ్‌లోనైనా గెలిచి, హార్దిక్ పాండ్యా సేన తమ ప్రచారాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాలని కోరుకుంటుంది. చివరి మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ గాయంతో ఆడలేదు. అయితే, రోహిత్ ఫిట్‌నెస్‌గా ఉన్నాడా లేడా అనేది మ్యాచ్‌కు ముందు తేలనుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉందనిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుస విజయాలతో తమ ప్రచారాన్ని ప్రారంభించిన ఆర్‌సీబీ.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని జట్టు ఐకానిక్ వాంఖడే స్టేడియంలో విజయాల బాట పట్టాలని చూస్తోంది.

ముంబైలోని వాంఖడే స్టేడియం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే, కొత్త బంతి స్వింగ్ అవుతుంది. ఓపెనింగ్ బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. బ్యాటర్లు క్రీజులో స్థిరపడగలిగితే, గేర్లు మార్చడం అంత కష్టం కాదు. IPLలో వాంఖడే స్టేడియంలో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 119 పరుగులుగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 171గా ఉంది. అయితే, ఛేజింగ్ జట్లు 65 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 53 సందర్భాలలో విజయం సాధించాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button