ఆంధ్ర ప్రదేశ్
Jyothula Nehru: దైవ సన్నిధిలో చనిపోవడం అదృష్టం

Jyothula Nehru: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లి తిరుపతిలో ఆరుగురు మృత్యువాత పడిన ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతూనే ఉంది. తొక్కిసలాటలో చనిపోయిన వారిపై జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దైవ సన్నిధిలో అసువులు బాసడం అదృష్టమని వ్యాఖ్యానించారు. తొక్కిసటాలతో మృత్యువాత పడిన కుటుంబాల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేసే కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ ఈ వ్యాఖ్యలు చేశారు. భక్తుల చావును అదృష్టంగా అభివర్ణిస్తూ స్వయంగా టీటీడీ మెంబర్ వ్యాఖ్యానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.