ఆంధ్ర ప్రదేశ్
పేర్ని నాని, అతని కుమారుడు కిట్టు అక్రమాలపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు

కృష్ణా జిల్లా బందర్ పీఎస్లో మాజీ మంత్రి పేర్ని నాని, అతని కుమారుడు కిట్టు అక్రమాలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పేర్ని నాని, అతని కుమారుడిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని పేర్ని నాని, కిట్టు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపించారు. రేషన్ బియ్యం మాయం కేసులో సరైన నివేదికలు ఇవ్వకుండా సివిల్ సప్లై అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. 7వేల 500 లకు పైగా రేషన్ బియ్యం బస్తాలు మాయమైతే ఎందుకు ఫిర్యాదు చేయలేదని అధికారులను విచారించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.