తెలంగాణ
Hyderabad: మియాపూర్లో లారీ బీభత్సం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

Hyderabad: హైదరాబాద్ మియాపూర్లో లారీ బీభత్సం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుళ్లపైకి దూసుకెళ్లింది లారీ. ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ సింహాచలం మృతి చెందాడు. మరో ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు రాజ్వర్ధన్, వికెందర్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.