ఆంధ్ర ప్రదేశ్

Rajahmundry: గోదావరిలో పడవ బోల్తా.. ఇద్దరు  మృతి

Rajahmundry: రాజమండ్రి వద్ద రాత్రి గోదావరిలో బోటు మునిగిన ప్రమాదంలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు చావల అన్నవరం, గాడ రాజుగా పోలీసులు గుర్తించారు. గోదావరి మధ్యలో ఉండే లంకలోని ఇసుక తెన్నులపై మద్యం సేవించడానికి 12 మంది బోట్ లో వెళ్లారు. తిరిగి రాత్రి బోటులో వస్తుండగా బోటుకు క్రింద కన్నం పడి నీళ్ళు లోపలికి ప్రవహించడంతో మునిగిపోయింది.

ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 12 మంది వరకు ఉన్నారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఇద్దరి మృతదేహాలు వెలికి తీశారు. మృతులు రాజమండ్రి శివారు సింహాచలనగర్, భవానీపురంకు చెందిన వారుగా గుర్తించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button