Chunchupalle: కులమతాలకు అతీతంగా రాములోరి కళ్యాణం

Chunchupalle: నేటి సమాజంలో కులాలు మతాల పేరుతో ఎక్కడో ఒక చోట నిత్యం దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని కులాలు,మతాల వారు కలిసుండటమనేది చాలా అరుదు. అటువంటిది ఆ ప్రాంతంలో ఏళ్ల తరబడి శ్రీరామనవమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి అనగానే మనకు హిందువులే గుర్తుకు వస్తారు. కానీ అక్కడ ఈ భేదాభిప్రాయాలు కనిపించవు. కులాలు, మతాలకు అతీతంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తారు. ఏళ్ల తరబడి కలిసికట్టుగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు.
చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీలో గత ఐదు సంవత్సరాలు శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే కులమతాలకు అతీతంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. శ్రీరాములవారి విగ్రహ దాత వాడపల్లి జకరయ్య ఇంటి నుంచి మేళతాళాలు, మంగళవాద్యాలతో విగ్రహాలు కల్యాణ మండపం చేరుకుంటాయి.
ఆతర్వాత సయ్యద్ షా దంపతులు ఇంటి నుంచి రాముల వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కాగా రాములవారి విగ్రహాన్ని క్రిస్టియన్ జకరయ్య తీసుకొస్తారు. ఇలా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే బేధాలు లేకుండా కులమతాలకు అతీతంగా ఇక్కడ రామయ్య కల్యాణాన్ని జరిపడం విశేషం.