సినిమా

Manchu Vishnu: రెండో పెళ్లిపై విష్ణు షాకింగ్ కామెంట్స్

Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. విష్ణు కెరీర్‌లో మంచి హిట్స్ ఉన్నాయి కానీ సొంతంగా మార్కెట్‌ని మాత్రం ఏర్పాటు చేసుకోలేకపోయాడు.అందుకే హిట్ కోసం ‘కన్నప్ప’ వంటి భారీ చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, వచ్చే నెల 25న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు ఇప్పటి నుండే ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా ఆయన రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

మంచు విష్ణు తన భార్య, పిల్లల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘ నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ళతో ఉన్నంతసేపు నేను ఈ లోకాన్నే మర్చిపోతుంటాను. నా భార్య విరోనికాని ఇంకా పిల్లలు కావాలని అడిగాను, అప్పుడు ఆమె నాకు ఓపిక లేదు, వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పింది’ అంటూ మంచు విష్ణు తెలిపారు. దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.ఇక విష్ణు పిల్లలు కూడా ‘కన్నప్ప’ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button